PRINT TIME: May 27, 2026 01:09 AM
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో రైతు మృతి
April 05, 2026 08:28 AM
83 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మోత్కూరు,
మండలంలోని పాటిమట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై రైతు దొండ కొమురయ్య (58) మృతి చెందారు.
ఆదివారం ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన కొమురయ్య, మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైతు మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి