PRINT TIME: July 01, 2026 03:13 PM
విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
April 14, 2026 07:03 PM
119 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, : దేశం అగ్రశక్తిగా ఎదగాలంటే విద్య, మహిళా సాధికారత కీలకమని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 375 మంది ఆదివాసీ, ఇద్దరు ట్రాన్స్జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్లు అందజేశారు.
విద్యార్థులు బి.ఆర్. అంబేద్కర్ తదితర మహానుభావుల ఆదర్శాలు అనుసరించాలని సూచించారు. మహిళలకు భవిష్యత్తులో 33% ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి సమతా స్కీంతో సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బండా ప్రకాశ్, జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి