విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్
విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్
Editor Desk
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను పటిష్టం చేయాలంటే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు.
గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/పాఠశాల ఆవరణలో వేదిక సభ్యులు, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకుల నిర్లక్ష్యం, తగిన బడ్జెట్ కేటాయింపుల లేమి కారణంగా ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాలలను సందర్శించి రూపొందించిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు.
కమీషన్ సిఫారసులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్, ఒగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి