Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:47 PM

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్
April 09, 2026 05:37 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను పటిష్టం చేయాలంటే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/పాఠశాల ఆవరణలో వేదిక సభ్యులు, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకుల నిర్లక్ష్యం, తగిన బడ్జెట్ కేటాయింపుల లేమి కారణంగా ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాలలను సందర్శించి రూపొందించిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు.

కమీషన్ సిఫారసులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్, ఒగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News