Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలి; ఎమ్మెల్యే సామెల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:46 PM

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్
April 09, 2026 05:37 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను పటిష్టం చేయాలంటే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/పాఠశాల ఆవరణలో వేదిక సభ్యులు, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకుల నిర్లక్ష్యం, తగిన బడ్జెట్ కేటాయింపుల లేమి కారణంగా ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాలలను సందర్శించి రూపొందించిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు.

కమీషన్ సిఫారసులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్, ఒగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News