ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం మోడల్ ప్రవేశ పరీక్ష
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం మోడల్ ప్రవేశ పరీక్ష
Editor Desk
హయత్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ తుదివ సంవత్సరం విద్యార్థుల కోసం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలపై అవగాహన కార్యక్రమంతో పాటు మోడల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు ఇంచార్జి డా. దుర్గాప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా టీజీ ఐసెట్ పరీక్షపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి మోడల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలకు అవసరమైన సన్నద్ధతను అంచనా వేయడమే ఈ పరీక్ష లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి, డా. ఏ. దుర్గాప్రసాద్, డా. డి. మక్ల, డా. రమాదేవి, డా. సుబ్రమణ్యం, డా. శారద, శ్రీ ఎన్. బాల, డా. ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి