Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:41 PM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం మోడల్ ప్రవేశ పరీక్ష

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం మోడల్ ప్రవేశ పరీక్ష

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం మోడల్ ప్రవేశ పరీక్ష
April 09, 2026 08:21 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ తుదివ సంవత్సరం విద్యార్థుల కోసం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలపై అవగాహన కార్యక్రమంతో పాటు మోడల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు ఇంచార్జి డా. దుర్గాప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా టీజీ ఐసెట్ పరీక్షపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి మోడల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలకు అవసరమైన సన్నద్ధతను అంచనా వేయడమే ఈ పరీక్ష లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి, డా. ఏ. దుర్గాప్రసాద్, డా. డి. మక్ల, డా. రమాదేవి, డా. సుబ్రమణ్యం, డా. శారద, శ్రీ ఎన్. బాల, డా. ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News