డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలపై పోస్టర్లు అంటించవద్దు– మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ బాబు హెచ్చరిక..
కోదాడ పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలకు ఆకర్షణీయమైన రంగులు, బొమ్మలు వేయించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఈ పెయింటింగ్స్పై వివిధ రకాల పోస్టర్లు అంటించి వాటి అందాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పట్టణ సౌందర్యానికి భంగం కలిగిస్తాయని పేర్కొంటూ, పోస్టర్లు అంటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కోదాడ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి