డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం
డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం
Editor Desk
డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.
మొదటి దశ రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్లు ఈనెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు దూర ప్రాంతాల కళాశాలలను ఎంచుకోవడం కంటే, స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అన్ని అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ క్లాస్రూమ్లు, సమృద్ధిగా ఉన్న గ్రంథాలయం, విస్తృత క్రీడామైదానం వంటి సౌకర్యాలు కళాశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పకుండా అడ్మిషన్ పొందాలని ప్రధానాచార్యులు పిలుపునిచ్చారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి