Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:26 PM

డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం

డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం

డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం
15-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ఆన్‌లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

మొదటి దశ రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్లు ఈనెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు దూర ప్రాంతాల కళాశాలలను ఎంచుకోవడం కంటే, స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అన్ని అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సమృద్ధిగా ఉన్న గ్రంథాలయం, విస్తృత క్రీడామైదానం వంటి సౌకర్యాలు కళాశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్‌సిసి వంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పకుండా అడ్మిషన్ పొందాలని ప్రధానాచార్యులు పిలుపునిచ్చారు

Sthanikam

డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం

Article Image

డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ఆన్‌లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

మొదటి దశ రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్లు ఈనెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు దూర ప్రాంతాల కళాశాలలను ఎంచుకోవడం కంటే, స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అన్ని అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సమృద్ధిగా ఉన్న గ్రంథాలయం, విస్తృత క్రీడామైదానం వంటి సౌకర్యాలు కళాశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్‌సిసి వంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పకుండా అడ్మిషన్ పొందాలని ప్రధానాచార్యులు పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News