Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా స్థాయి రగ్గీ పోటీలకు వెల్లంకి జెడ్పీహెచ్‌ఎస్‌కు ఆహ్వానం గుడిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం… 101వ బ్రహ్మోత్సవాల్లో ఘనంగా శయనోత్సవం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 07:58 PM

ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు పూర్తి చేసి జూన్ నాటికి సాగు నీరు అందివ్వాలి

ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు పూర్తి చేసి జూన్ నాటికి సాగు నీరు అందివ్వాలి

ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు పూర్తి చేసి జూన్ నాటికి సాగు నీరు అందివ్వాలి
April 06, 2026 06:11 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గత లోపాలను సరిదిద్దుకొని రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రబి సీజన్ వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నదని ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసి నిండిపోతున్నవని ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతో గతంలో మాదిరిగా అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.వెంటనే కొనుగోలు ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బంది జరగకుండా త్వరగా కొనుగోలుచేస్తే రైతులకు ఉపయోగం జరుగుతుందని దీనికోసం అధికార యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు. నెలల తరబడి ధాన్యం రాశులు మార్కెట్ కేంద్రాల్లో నిలువ ఉండడంతో రైతులకు పట్టాల కిరాయి ఎక్కువై ధాన్యం తడిసి రంగు మారుతుండడంతో రైస్ మిల్లు యజమాన్యం కోతలు విధించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని ఆర్థికంగా రైతు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని గన్నీ బ్యాగుల కొరతను నివారించాలని మార్కెట్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, లారీల కొరత లేకుండా చూడాలని అన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి జూన్ నెల నాటికల్లా రామన్నపేట ప్రాంత రైతులకు నీరు అందివ్వాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం రైతు సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా బోయిని ఆనంద్, మండల కార్యదర్శిగా గన్నేబోయిన విజయభాస్కర్, ఉపాధ్యక్షులుగా కందుల మల్లారెడ్డి,తాళ్లపల్లి జితేందర్ మండల కమిటి సభ్యులుగా కొమ్ము అంజమ్మ,కరకంటి మల్లయ్య, బోల్ల వెంకన్న,దేవరపల్లి బిక్షం రెడ్డి,దాడి మల్లారెడ్డి, సిల్వర్ రాజు,తాడూరి కిష్టయ్య, కాకులారపు కల్పన, గంగాదేవి అంజయ్య, బండ జగన్మోహన్ రెడ్డి తదితరులను ఎన్నుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News