ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి
Editor Desk
నలగొండ, మండల కేంద్రంలోని అనంతారం గ్రామంలో ఎన్డీసీఎంఎస్ (NDCMS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారి (ఏఈఓ) మురళి గురువారం పరిశీలించారు.
కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన, రైతులు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. తూకం, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ, రైతులకు పారదర్శకంగా మద్దతు ధర అందించాలని పేర్కొన్నారు.
మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీసీఎంఎస్ నిర్వాహకులు సుంకరబోయిన శంకర్, తిరుపల నాగరాజు, కడారి శంకర్, తిరుపాల పరమేష్, ఆవుల రాజు, స్థానిక అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి