Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 11:10 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి
April 09, 2026 09:31 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నలగొండ, మండల కేంద్రంలోని అనంతారం గ్రామంలో ఎన్‌డీసీఎంఎస్ (NDCMS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారి (ఏఈఓ) మురళి గురువారం పరిశీలించారు.

కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన, రైతులు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. తూకం, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ, రైతులకు పారదర్శకంగా మద్దతు ధర అందించాలని పేర్కొన్నారు.

మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌డీసీఎంఎస్ నిర్వాహకులు సుంకరబోయిన శంకర్, తిరుపల నాగరాజు, కడారి శంకర్, తిరుపాల పరమేష్, ఆవుల రాజు, స్థానిక అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News