Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 10:21 PM

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 21, 2026 08:38 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: రైతులు పండించిన ధాన్యం కుప్పలను తేమ శాతం పరిశీలించి వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ… ఏఈఓలు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం, నాణ్యతను పరిశీలించాలని సూచించారు. వరి కుప్పలను సమగ్రంగా తనిఖీ చేసి, మాయిశ్చర్ శాతం సరిగా వచ్చిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిరోజూ ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి స్ప్రెడ్‌షీట్ ఆధారంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం పరిశీలనలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని, ఉదయం 6 గంటల నుంచే కేంద్రాల్లో తనిఖీలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా సరఫరాల మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News