Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:13 AM

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 21, 2026 08:38 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: రైతులు పండించిన ధాన్యం కుప్పలను తేమ శాతం పరిశీలించి వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ… ఏఈఓలు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం, నాణ్యతను పరిశీలించాలని సూచించారు. వరి కుప్పలను సమగ్రంగా తనిఖీ చేసి, మాయిశ్చర్ శాతం సరిగా వచ్చిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిరోజూ ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి స్ప్రెడ్‌షీట్ ఆధారంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం పరిశీలనలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని, ఉదయం 6 గంటల నుంచే కేంద్రాల్లో తనిఖీలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా సరఫరాల మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News