ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్రావు
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్రావు
Editor Desk
భువనగిరి: రైతులు పండించిన ధాన్యం కుప్పలను తేమ శాతం పరిశీలించి వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ… ఏఈఓలు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం, నాణ్యతను పరిశీలించాలని సూచించారు. వరి కుప్పలను సమగ్రంగా తనిఖీ చేసి, మాయిశ్చర్ శాతం సరిగా వచ్చిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిరోజూ ఉదయం నుంచే ఫీల్డ్లో ఉండి స్ప్రెడ్షీట్ ఆధారంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం పరిశీలనలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని, ఉదయం 6 గంటల నుంచే కేంద్రాల్లో తనిఖీలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా సరఫరాల మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి