Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 11:45 PM

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్
April 24, 2026 10:02 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-బాధ్యులపై చర్యలు తీసుకోవాలి .. కర్రె ప్రవీణ్

యాదగిరిగుట్ట పట్టణంలోని సింహద్వారం సమీపంలో దేవస్థానం భూమిలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని ఆరోపిస్తూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. షెడ్ వద్దే ఆందోళన నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ... దేవస్థానం ఆస్తులపై కబ్జాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా,సంబంధిత అధికారుల అనుమతి లేకుండా షెడ్ ఎలా నిర్మించారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.సాధారణ ప్రజలు ఇలాంటి పనులు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసే పోలీసులు, ఈ ఘటనలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తమ నిరసన తర్వాత అధికారులు తొందరపాటుగా షెడ్ తొలగించారని,అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. చైర్మన్ భర్తతో పాటు సంబంధితులపై,అలాగే షెడ్ నిర్మాణానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రచ్చ శ్రీనివాస్,భువనగిరి శ్యామ్,గుంటుపల్లి సత్యం,ఆకుల చంద్రమౌళి,నరేష్,రంగా సత్యం,నల్ల వెంకట్ రెడ్డి,బోడ సురేష్,వంశీ,లక్ష్మయ్య,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News