Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:32 PM

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్
April 24, 2026 10:02 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-బాధ్యులపై చర్యలు తీసుకోవాలి .. కర్రె ప్రవీణ్

యాదగిరిగుట్ట పట్టణంలోని సింహద్వారం సమీపంలో దేవస్థానం భూమిలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని ఆరోపిస్తూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. షెడ్ వద్దే ఆందోళన నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ... దేవస్థానం ఆస్తులపై కబ్జాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా,సంబంధిత అధికారుల అనుమతి లేకుండా షెడ్ ఎలా నిర్మించారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.సాధారణ ప్రజలు ఇలాంటి పనులు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసే పోలీసులు, ఈ ఘటనలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తమ నిరసన తర్వాత అధికారులు తొందరపాటుగా షెడ్ తొలగించారని,అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. చైర్మన్ భర్తతో పాటు సంబంధితులపై,అలాగే షెడ్ నిర్మాణానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రచ్చ శ్రీనివాస్,భువనగిరి శ్యామ్,గుంటుపల్లి సత్యం,ఆకుల చంద్రమౌళి,నరేష్,రంగా సత్యం,నల్ల వెంకట్ రెడ్డి,బోడ సురేష్,వంశీ,లక్ష్మయ్య,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News