దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్
దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్
Sthanikam District Staff Reporter
-బాధ్యులపై చర్యలు తీసుకోవాలి .. కర్రె ప్రవీణ్
యాదగిరిగుట్ట పట్టణంలోని సింహద్వారం సమీపంలో దేవస్థానం భూమిలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని ఆరోపిస్తూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. షెడ్ వద్దే ఆందోళన నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ... దేవస్థానం ఆస్తులపై కబ్జాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా,సంబంధిత అధికారుల అనుమతి లేకుండా షెడ్ ఎలా నిర్మించారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.సాధారణ ప్రజలు ఇలాంటి పనులు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసే పోలీసులు, ఈ ఘటనలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తమ నిరసన తర్వాత అధికారులు తొందరపాటుగా షెడ్ తొలగించారని,అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. చైర్మన్ భర్తతో పాటు సంబంధితులపై,అలాగే షెడ్ నిర్మాణానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రచ్చ శ్రీనివాస్,భువనగిరి శ్యామ్,గుంటుపల్లి సత్యం,ఆకుల చంద్రమౌళి,నరేష్,రంగా సత్యం,నల్ల వెంకట్ రెడ్డి,బోడ సురేష్,వంశీ,లక్ష్మయ్య,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి