Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 09:55 AM

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన
April 22, 2026 12:27 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు దిగజారుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ డీసీపీ స్థాయి అధికారికే పాచిపోయిన ఆహారం వడ్డించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

జూబ్లీ హిల్స్‌లోని ‘తెలుగు మీడియం’ రెస్టారెంట్ నుంచి డీసీపీ ముత్యం రెడ్డి ఆన్లైన్‌లో ఆర్డర్ చేసిన మటన్ కీమా నుంచి దుర్వాసన రావడంతో ఘటన బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న ఆహార భద్రత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు.

దాడుల్లో వంటగదిలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం బయటపడినట్లు తెలిసింది. కేవలం గత నెలలోనే నగరవ్యాప్తంగా 129 టన్నుల పాడైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, రెస్టారెంట్ల నిర్వహణలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మాంసంతో పాటు పాలు, మసాలాలు, నూనెలలో కల్తీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News