హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు దిగజారుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ డీసీపీ స్థాయి అధికారికే పాచిపోయిన ఆహారం వడ్డించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
జూబ్లీ హిల్స్లోని ‘తెలుగు మీడియం’ రెస్టారెంట్ నుంచి డీసీపీ ముత్యం రెడ్డి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మటన్ కీమా నుంచి దుర్వాసన రావడంతో ఘటన బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న ఆహార భద్రత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు.
దాడుల్లో వంటగదిలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం బయటపడినట్లు తెలిసింది. కేవలం గత నెలలోనే నగరవ్యాప్తంగా 129 టన్నుల పాడైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, రెస్టారెంట్ల నిర్వహణలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మాంసంతో పాటు పాలు, మసాలాలు, నూనెలలో కల్తీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి