Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:13 PM

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన
22-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు దిగజారుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ డీసీపీ స్థాయి అధికారికే పాచిపోయిన ఆహారం వడ్డించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

జూబ్లీ హిల్స్‌లోని ‘తెలుగు మీడియం’ రెస్టారెంట్ నుంచి డీసీపీ ముత్యం రెడ్డి ఆన్లైన్‌లో ఆర్డర్ చేసిన మటన్ కీమా నుంచి దుర్వాసన రావడంతో ఘటన బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న ఆహార భద్రత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు.

దాడుల్లో వంటగదిలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం బయటపడినట్లు తెలిసింది. కేవలం గత నెలలోనే నగరవ్యాప్తంగా 129 టన్నుల పాడైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, రెస్టారెంట్ల నిర్వహణలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మాంసంతో పాటు పాలు, మసాలాలు, నూనెలలో కల్తీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన

Article Image

హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు దిగజారుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ డీసీపీ స్థాయి అధికారికే పాచిపోయిన ఆహారం వడ్డించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

జూబ్లీ హిల్స్‌లోని ‘తెలుగు మీడియం’ రెస్టారెంట్ నుంచి డీసీపీ ముత్యం రెడ్డి ఆన్లైన్‌లో ఆర్డర్ చేసిన మటన్ కీమా నుంచి దుర్వాసన రావడంతో ఘటన బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న ఆహార భద్రత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు.

దాడుల్లో వంటగదిలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం బయటపడినట్లు తెలిసింది. కేవలం గత నెలలోనే నగరవ్యాప్తంగా 129 టన్నుల పాడైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, రెస్టారెంట్ల నిర్వహణలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మాంసంతో పాటు పాలు, మసాలాలు, నూనెలలో కల్తీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News