Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు పాల్గొని సహకరించాలి:చింత గోపాల్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:01 PM

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 27, 2026 04:31 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ద్వారా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన దత్తత సహాయవాణి (అడాప్షన్ హెల్ప్ డెస్క్), చైల్డ్ వీక్ స్టాండీలను జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అక్రమ దత్తతలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ మనోహర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ జయశ్రీ, బీఆర్‌బీ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, మహిళా సాధికారత బృందం, డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News