దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్రావు
దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్రావు
Editor Desk
యాదాద్రి భువనగిరి: మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ద్వారా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏర్పాటు చేసిన దత్తత సహాయవాణి (అడాప్షన్ హెల్ప్ డెస్క్), చైల్డ్ వీక్ స్టాండీలను జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అక్రమ దత్తతలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఎంహెచ్ఓ మనోహర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ జయశ్రీ, బీఆర్బీ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, మహిళా సాధికారత బృందం, డీసీపీయూ, చైల్డ్లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి