Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజావాణి అర్జీలకు త్వరిత పరిష్కారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 06:20 PM

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 27, 2026 04:31 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ద్వారా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన దత్తత సహాయవాణి (అడాప్షన్ హెల్ప్ డెస్క్), చైల్డ్ వీక్ స్టాండీలను జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అక్రమ దత్తతలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ మనోహర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ జయశ్రీ, బీఆర్‌బీ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, మహిళా సాధికారత బృందం, డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News