వంగపల్లి,
వంగపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మిగిలిన మౌలిక వసతుల పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, భవనాలకు రంగులు వేయడం వంటి పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
లబ్ధిదారులు ఇండ్లలో నివాసం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి