Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 09:27 AM

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల
March 14, 2026 07:18 AM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని రైతులకు ప్రతీకాత్మక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని 36,818 మంది రైతులకు మొత్తం రూ.20 కోట్ల 51 లక్షల పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్‌పర్సన్ చీదరాల దుర్గ పార్వతి మధుబాబు, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారులు వి.ప్రదీప్ కుమార్, కె.మురళీకృష్ణ, సి.పవన్ కుమార్, డి.ముత్యాలరావు, కూటమి నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్త సత్యసాయి వరప్రసాద్, గరిమెళ్ల చలపతిరావు, నిమ్మగడ్డ సుధాకర్, మోరంపూడి వరప్రసాద్, పల్లి శ్రీను, చల్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News