Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:37 AM

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల
14-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని రైతులకు ప్రతీకాత్మక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని 36,818 మంది రైతులకు మొత్తం రూ.20 కోట్ల 51 లక్షల పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్‌పర్సన్ చీదరాల దుర్గ పార్వతి మధుబాబు, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారులు వి.ప్రదీప్ కుమార్, కె.మురళీకృష్ణ, సి.పవన్ కుమార్, డి.ముత్యాలరావు, కూటమి నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్త సత్యసాయి వరప్రసాద్, గరిమెళ్ల చలపతిరావు, నిమ్మగడ్డ సుధాకర్, మోరంపూడి వరప్రసాద్, పల్లి శ్రీను, చల్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల

Article Image

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని రైతులకు ప్రతీకాత్మక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని 36,818 మంది రైతులకు మొత్తం రూ.20 కోట్ల 51 లక్షల పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్‌పర్సన్ చీదరాల దుర్గ పార్వతి మధుబాబు, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారులు వి.ప్రదీప్ కుమార్, కె.మురళీకృష్ణ, సి.పవన్ కుమార్, డి.ముత్యాలరావు, కూటమి నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్త సత్యసాయి వరప్రసాద్, గరిమెళ్ల చలపతిరావు, నిమ్మగడ్డ సుధాకర్, మోరంపూడి వరప్రసాద్, పల్లి శ్రీను, చల్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News