చిన్నారులకు ఆశీర్వాదం అందించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Editor Desk
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం శుభవాతావరణంలో ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన నన్నూరి రవీందర్ రెడ్డి కుమారుల ఈ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన, చిన్నారుల భవిష్యత్తు उज్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుక కొనసాగింది.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, సర్పంచులు ఈడం రాధా శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, జిల్లా నాయకుడు ఎస్.కె. చాంద్, గ్రామ కార్యదర్శి పిట్ట మహేందర్ రెడ్డి, నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, పాశం సతీష్ రెడ్డి, బొలుగుల కృష్ణ, బొడ్డుపల్లి రాజు, వర్కల రమేష్, కొమ్ము రాము తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి