Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:25 PM

చిన్నారుల భవిష్యత్తుకు అండగా తుమ్మల ప్రమోద్

చిన్నారుల భవిష్యత్తుకు అండగా తుమ్మల ప్రమోద్

చిన్నారుల భవిష్యత్తుకు అండగా తుమ్మల ప్రమోద్
April 26, 2026 01:23 PM 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి అండగా ఉన్న ఏలూరి రవి మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. భార్య ఏలూరి మానస, ఇద్దరు చిన్నారి కుమార్తెల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ మానవత్వం చూపిన దాత ముందుకొచ్చారు.

గ్రామ సర్పంచ్ నర్సింహ గట్టు ద్వారా విషయం తెలుసుకున్న తుమ్మల ప్రమోద్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్య, జీవన అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

అంతేకాక చిన్న కూతురు పేరుపై సుకన్య సమృద్ధి పథకం కింద రూ.54 వేల డిపాజిట్ చేసి, భవిష్యత్తులో సుమారు రూ.2 లక్షలు అందేలా చర్యలు తీసుకున్నారు. బాధలో ఉన్న తల్లికి ధైర్యం చెప్పి, ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ సహాయాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ, చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించిన తుమ్మల ప్రమోద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News