చిన్నారుల భవిష్యత్తుకు అండగా తుమ్మల ప్రమోద్
చిన్నారుల భవిష్యత్తుకు అండగా తుమ్మల ప్రమోద్
Editor Desk
రామన్నపేట
రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి అండగా ఉన్న ఏలూరి రవి మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. భార్య ఏలూరి మానస, ఇద్దరు చిన్నారి కుమార్తెల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ మానవత్వం చూపిన దాత ముందుకొచ్చారు.
గ్రామ సర్పంచ్ నర్సింహ గట్టు ద్వారా విషయం తెలుసుకున్న తుమ్మల ప్రమోద్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్య, జీవన అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
అంతేకాక చిన్న కూతురు పేరుపై సుకన్య సమృద్ధి పథకం కింద రూ.54 వేల డిపాజిట్ చేసి, భవిష్యత్తులో సుమారు రూ.2 లక్షలు అందేలా చర్యలు తీసుకున్నారు. బాధలో ఉన్న తల్లికి ధైర్యం చెప్పి, ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ సహాయాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ, చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించిన తుమ్మల ప్రమోద్కు కృతజ్ఞతలు తెలిపారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి