చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక
చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక
Harish K
చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక
చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల నూతన కమిటీని ఆర్.టి.ఐ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి,చిలుకూరు మండల అధ్యక్షుడు నూక పొంగు వినోద్,వీరబాబు,శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. చిలుకూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా కందుకూరు వంశీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మండవ వీరబాబు, జాయింట్ సెక్రెటరీ మల్లెపంగు ఉపేందర్, ఆర్గనైజర్ షేక్ మీరా, కోఆర్గనేజర్ కోల శ్రీను, కోఆర్డినేటర్ సిద్దెల రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి మాట్లాడుతూ.. చిలుకూరు మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 అధ్యక్షుడు డాక్టర్ నవీన్ తేజ ఆదేశాల మేరకు, ఆయా మండల కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. చిలుకూరు నూతన మండల కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. చిలుకూరు మండలంలో ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చినారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి