Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:25 PM

చేనేతకు 'రాజకీయ' ఊపిరి పోయాలి!

చేనేతకు 'రాజకీయ' ఊపిరి పోయాలి!

చేనేతకు 'రాజకీయ' ఊపిరి పోయాలి!
April 24, 2026 09:05 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పద్మశాలీలకు ప్రాతినిధ్యం ఉంటేనే సమస్యలకు పరిష్కారం

చౌటుప్పల్‌లో చేనేత హక్కుల సాధన సభ.. గర్జించిన నేతన్నలు

"జనాభా ఉంది.. కానీ ప్రాతినిధ్యం లేదు. ప్రాతినిధ్యం లేనందునే బడ్జెట్‌లో వాటా దక్కడం లేదు" - ఇదీ చౌటుప్పల్ వేదికగా సాగిన చేనేత హక్కుల సాధన సభలో వినిపించిన ప్రధాన నినాదం. చేనేత రంగం మనుగడ సాగించాలన్నా, నేతన్నల కష్టాలు తీరాలన్నా పద్మశాలి సమాజంలో రాజకీయ చైతన్యం వెల్లివిరియాలని వక్తలు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.

సంక్షోభంలో చేనేత.. మౌనం వీడాల్సిన సమయం

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చేనేత హక్కుల సాధన సభ శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్. రమణ, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

​పద్మశాలీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోకూడదని, చట్టసభల్లో మన గొంతు వినిపించినప్పుడే సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.​ నూలు, రంగుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పెరిగిన పెట్టుబడికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కష్టపడేది కార్మికులైతే, లాభాలు మాత్రం మధ్యవర్తుల పాలవుతున్నాయని, మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.​"ఇది కేవలం ఒక వృత్తిని కాపాడుకునే ప్రయత్నం కాదు.. ఇది పద్మశాలీల ఆత్మగౌరవ పోరాటం. రాజకీయంగా ఎదిగినప్పుడే మన హక్కులను మనం శాసించగలం."​​చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి.ముడిసరుకులపై సబ్సిడీని నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి.​చేనేత ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి.​పద్మశాలి సమాజానికి జనాభా ప్రాతిపదికన రాజకీయ పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలి.

​ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుండి పద్మశాలి సంఘం నాయకులు, చేనేత కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News