చేనేత కార్మికులకు వైద్య శిబిరం 67 మందికి చికిత్స… ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్
చేనేత కార్మికులకు వైద్య శిబిరం 67 మందికి చికిత్స… ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్
Editor Desk
చౌటుప్పల్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలోని చేనేత సహకార సంఘంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అన్యాలపు నరేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అందిస్తున్న ఆరోగ్య సేవలను వినియోగించుకుని ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. శిబిరంలో మొత్తం 67 మంది చేనేత కార్మికులు వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు. వీరిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 22, 23 తేదీలలో కొయ్యలగూడెం గ్రామ చేనేత సహకార సంఘంలో కూడా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలమోహన్ రెడ్డి, ఏడీఓ, తంగేడుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కాటంరాజు, పల్లె దవాఖాన సిబ్బంది, ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి