Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:59 PM

చేనేత కార్మికులకు వైద్య శిబిరం 67 మందికి చికిత్స… ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్

చేనేత కార్మికులకు వైద్య శిబిరం 67 మందికి చికిత్స… ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్

చేనేత కార్మికులకు వైద్య శిబిరం 67 మందికి చికిత్స… ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్
April 21, 2026 08:28 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలోని చేనేత సహకార సంఘంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అన్యాలపు నరేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అందిస్తున్న ఆరోగ్య సేవలను వినియోగించుకుని ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. శిబిరంలో మొత్తం 67 మంది చేనేత కార్మికులు వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు. వీరిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 22, 23 తేదీలలో కొయ్యలగూడెం గ్రామ చేనేత సహకార సంఘంలో కూడా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలమోహన్ రెడ్డి, ఏడీఓ, తంగేడుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కాటంరాజు, పల్లె దవాఖాన సిబ్బంది, ఎంఎల్హెచ్‌పీలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News