Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:07 PM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
23-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

రెండవ రోజు నిర్వహించిన ఈ శిబిరంలో డా. కాటం రాజు (వైద్యాధికారి, తంగేడు పల్లి), ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వైద్య సేవలు అందించారు.

మొత్తం 126 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 43 మంది, ఆర్థోపెడిక్స్‌కు 30 మంది, కంటి సమస్యలకు 53 మందికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 10 మందిని తదుపరి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ శిబిరం ద్వారా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందినట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

Article Image

చౌటుప్పల్,

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

రెండవ రోజు నిర్వహించిన ఈ శిబిరంలో డా. కాటం రాజు (వైద్యాధికారి, తంగేడు పల్లి), ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వైద్య సేవలు అందించారు.

మొత్తం 126 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 43 మంది, ఆర్థోపెడిక్స్‌కు 30 మంది, కంటి సమస్యలకు 53 మందికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 10 మందిని తదుపరి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ శిబిరం ద్వారా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News