చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
Editor Desk
చౌటుప్పల్,
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
రెండవ రోజు నిర్వహించిన ఈ శిబిరంలో డా. కాటం రాజు (వైద్యాధికారి, తంగేడు పల్లి), ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వైద్య సేవలు అందించారు.
మొత్తం 126 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 43 మంది, ఆర్థోపెడిక్స్కు 30 మంది, కంటి సమస్యలకు 53 మందికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 10 మందిని తదుపరి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ శిబిరం ద్వారా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందినట్లు అధికారులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి