Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 07:09 PM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
April 23, 2026 05:39 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

రెండవ రోజు నిర్వహించిన ఈ శిబిరంలో డా. కాటం రాజు (వైద్యాధికారి, తంగేడు పల్లి), ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వైద్య సేవలు అందించారు.

మొత్తం 126 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 43 మంది, ఆర్థోపెడిక్స్‌కు 30 మంది, కంటి సమస్యలకు 53 మందికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 10 మందిని తదుపరి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ శిబిరం ద్వారా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News