Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:08 PM

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు
April 15, 2026 05:45 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 10,323 మంది చేనేత కార్మికులు ఉన్నట్లు పేర్కొంటూ, ఆయా మండలాలు, గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ శిబిరాల్లో జనరల్ ఫిజీషియన్, కంటి వైద్యుడు, ఎముకల నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తారని చెప్పారు.

రక్తపోటు, షుగర్, కంటి, ఎముకల సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపడతారని, అవసరమైతే రోగులను రిఫరల్ ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు.

ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వివిధ మండలాలు, గ్రామాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

శిబిరాల ముఖ్య తేదీలు:

ఏప్రిల్ 16: ఆలేరు

ఏప్రిల్ 17: ఆత్మకూరు

ఏప్రిల్ 18: భువనగిరి

ఏప్రిల్ 20–23: చౌటుప్పల్ పరిసరాలు

ఏప్రిల్ 24: మోటకొండూరు

ఏప్రిల్ 25: మోత్కూర్

ఏప్రిల్ 27–మే 2: పోచంపల్లి

మే 4: రాజాపేట

మే 5, 6: రామన్నపేట

మే 7: వలిగొండ

మే 8: యాదగిరిగుట్ట

మే 11: గుండాల

మే 12: నారాయణపూర్

మే 13: పుట్టపాక

జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News