Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:21 PM

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు
15-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 10,323 మంది చేనేత కార్మికులు ఉన్నట్లు పేర్కొంటూ, ఆయా మండలాలు, గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ శిబిరాల్లో జనరల్ ఫిజీషియన్, కంటి వైద్యుడు, ఎముకల నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తారని చెప్పారు.

రక్తపోటు, షుగర్, కంటి, ఎముకల సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపడతారని, అవసరమైతే రోగులను రిఫరల్ ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు.

ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వివిధ మండలాలు, గ్రామాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

శిబిరాల ముఖ్య తేదీలు:

ఏప్రిల్ 16: ఆలేరు

ఏప్రిల్ 17: ఆత్మకూరు

ఏప్రిల్ 18: భువనగిరి

ఏప్రిల్ 20–23: చౌటుప్పల్ పరిసరాలు

ఏప్రిల్ 24: మోటకొండూరు

ఏప్రిల్ 25: మోత్కూర్

ఏప్రిల్ 27–మే 2: పోచంపల్లి

మే 4: రాజాపేట

మే 5, 6: రామన్నపేట

మే 7: వలిగొండ

మే 8: యాదగిరిగుట్ట

మే 11: గుండాల

మే 12: నారాయణపూర్

మే 13: పుట్టపాక

జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Sthanikam

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

Article Image

జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 10,323 మంది చేనేత కార్మికులు ఉన్నట్లు పేర్కొంటూ, ఆయా మండలాలు, గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ శిబిరాల్లో జనరల్ ఫిజీషియన్, కంటి వైద్యుడు, ఎముకల నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తారని చెప్పారు.

రక్తపోటు, షుగర్, కంటి, ఎముకల సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపడతారని, అవసరమైతే రోగులను రిఫరల్ ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు.

ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వివిధ మండలాలు, గ్రామాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

శిబిరాల ముఖ్య తేదీలు:

ఏప్రిల్ 16: ఆలేరు

ఏప్రిల్ 17: ఆత్మకూరు

ఏప్రిల్ 18: భువనగిరి

ఏప్రిల్ 20–23: చౌటుప్పల్ పరిసరాలు

ఏప్రిల్ 24: మోటకొండూరు

ఏప్రిల్ 25: మోత్కూర్

ఏప్రిల్ 27–మే 2: పోచంపల్లి

మే 4: రాజాపేట

మే 5, 6: రామన్నపేట

మే 7: వలిగొండ

మే 8: యాదగిరిగుట్ట

మే 11: గుండాల

మే 12: నారాయణపూర్

మే 13: పుట్టపాక

జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News