చేనేత కార్మికులకు కోట్ల వర్షం – రుణమాఫీ, భరోసా, బీమా చెక్కుల పంపిణీ.
చేనేత కార్మికులకు కోట్ల వర్షం – రుణమాఫీ, భరోసా, బీమా చెక్కుల పంపిణీ.
Editor Desk
భువనగిరిలోని లింగ బసవ గార్డెన్లో శుక్రవారం చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
చేనేత రుణమాఫీ పథకం కింద రూ.19.24 కోట్లు, నేతన్న భరోసా పథకం కింద రూ.3.29 కోట్లు, నేతన్న బీమా పథకం కింద రూ.2.40 కోట్లు విడుదల చేసి జిల్లాలోని చేనేత కార్మికులకు అందజేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ పథకాల ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకరెడ్డి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి