చౌటుప్పల్లో ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి
చౌటుప్పల్లో ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి
K.RAVI
అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు
పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక రామాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి భక్తి చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం 'జై వాసవి' నామస్మరణతో మారుమోగింది.ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు.ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు మంచి కంటి భాస్కర్, సోమవారం సత్తయ్య, కామిశెట్టి చంద్రశేఖర్, పాలడుగు వెంకటేష్, నాంపల్లి శీను, తడకమళ్ళ శీను, దాచేపల్లి శ్రీను, నీల రమేష్, ఉప్పల కృష్ణ, వీరమల్ల సూర్యనారాయణ, సతీష్ కుమార్, సముద్రాల సత్యనారాయణ, దాచేపల్లి లక్ష్మి, మంచి కంటి ప్రమీల, కామిశెట్టి శ్రీదేవి, పాలడుగు వందన, నాంపల్లి అమృత, తడకమల్ల సుష్మ, దాచేపల్లి రమాదేవి, గోరంటి సంధ్య, సోమవారం వెంకటమ్మ, సముద్రాల వాణి, సింగిడికొండ శైలజ, నాంపల్లి సంగీత, గట్టుఉప్పల కుసుమ, దీపిక, యమునా, రమాదేవి, పుష్పమ్మ, అశ్విని తదితరులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి