చౌటుప్పల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. ఎలివేటెడ్ కారిడార్కు అడుగులు!
చౌటుప్పల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. ఎలివేటెడ్ కారిడార్కు అడుగులు!
K.RAVI
యూపీ వాల్స్ బదులు పిల్లర్ల నిర్మాణం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశం
బస్టాండ్ సమీపంలో భారీ అండర్పాస్.. ప్రారంభమైన మార్కింగ్ పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న మున్సిపల్ పాలకవర్గం, పట్టణ ప్రజలు
చౌటుప్పల్ పట్టణ ముఖచిత్రం మారబోతోంది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా స్థానిక ప్రజల అవసరాలను గుర్తించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిర్మాణ ప్రణాళికలో కీలక మార్పులు చేయించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. పట్టణ నడిబొడ్డున ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.తొలుత జాతీయ రహదారి పనుల్లో భాగంగా చౌటుప్పల్లో యూపీ వాల్స్ నిర్మించాలని అధికారులు భావించారు. అయితే, దీనివల్ల పట్టణం రెండుగా విడిపోవడమే కాకుండా, స్థానిక వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, పాలకవర్గం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 9వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాత ప్రణాళికను రద్దు చేయాలని ఆదేశించారు."చౌటుప్పల్ అభివృద్ధి మా బాధ్యత. కేవలం రోడ్డు వేయడమే కాదు, అది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలి." - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే.
అండర్పాస్తో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సుమారు 30 మీటర్ల వెడల్పుతో భారీ అండర్పాస్ నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. దీనివల్ల బస్సులు, ఇతర భారీ వాహనాల రాకపోకలకు ఆటంకం కలగదు. ఎమ్మెల్యే సూచనలకు నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్లు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే, బుధవారం నాడు సుమారు 20 మీటర్ల వెడల్పుతో అండర్పాస్ నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.పట్టణ ప్రజల విన్నపాన్ని మన్నించి, తక్షణమే స్పందించి పనులు ప్రారంభమయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో చౌటుప్పల్ పట్టణం ఆధునిక హంగులతో అభివృద్ధి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి