Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:00 AM

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎంఈఓ గురువారావు

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎంఈఓ గురువారావు

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎంఈఓ గురువారావు
21-04-2026 187 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ట్రినిటీ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

విద్యార్థులు చదువులో రాణిస్తేనే సమాజంలో గౌరవం, మంచి భవిష్యత్తు లభిస్తాయని మండల విద్యాధికారి గురువారావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని వీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ట్రినిటీ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్రాడ్యుయేషన్ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్, ఎంఈఓ గురువారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థుల మనోవికాసానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువును భారంగా భావించకుండా, ఆడుతూ పాడుతూ ఇష్టపడి చదవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ట్రినిటీ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.​గతంలో కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితమైన గ్రాడ్యుయేషన్ వేడుకలను పాఠశాల స్థాయిలో నిర్వహించడం వల్ల చిన్న పిల్లల్లో చదువుపై ఆసక్తి, బాధ్యత పెరుగుతాయని ఎంఈఓ గురువారావు తెలిపారు. ఇదే క్రమంలో తల్లిదండ్రులకు ఆయన కీలక సూచనలు చేశారు. పూర్వం చందమామను చూపిస్తూ అన్నం తినిపించేవారని, ఇప్పుడు సెల్ ఫోన్లు చూపిస్తూ తినిపిస్తున్నారని..ఈ ధోరణి మారాలని కోరారు.స్కూల్ నుండి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఫోన్లకు దూరంగా ఉండి, రోజుకు కనీసం ఒక గంట పిల్లలతో గడిపితే వారిలో సానుకూల మార్పు వస్తుందని చెప్పారు.ఈ వేడుకలో గాంధీ గ్లోబల్ మండల కన్వీనర్ వెన్ రెడ్డి సంధ్యా రాజు, ఏడవ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల చైర్మన్ కే.వీ.బీ. కృష్ణారావు, ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల, చింతల కరుణ, పబ్బు వంశీ, బడుగు శ్రీరాములు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎంఈఓ గురువారావు

Article Image

ట్రినిటీ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

విద్యార్థులు చదువులో రాణిస్తేనే సమాజంలో గౌరవం, మంచి భవిష్యత్తు లభిస్తాయని మండల విద్యాధికారి గురువారావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని వీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ట్రినిటీ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్రాడ్యుయేషన్ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్, ఎంఈఓ గురువారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థుల మనోవికాసానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువును భారంగా భావించకుండా, ఆడుతూ పాడుతూ ఇష్టపడి చదవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ట్రినిటీ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.​గతంలో కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితమైన గ్రాడ్యుయేషన్ వేడుకలను పాఠశాల స్థాయిలో నిర్వహించడం వల్ల చిన్న పిల్లల్లో చదువుపై ఆసక్తి, బాధ్యత పెరుగుతాయని ఎంఈఓ గురువారావు తెలిపారు. ఇదే క్రమంలో తల్లిదండ్రులకు ఆయన కీలక సూచనలు చేశారు. పూర్వం చందమామను చూపిస్తూ అన్నం తినిపించేవారని, ఇప్పుడు సెల్ ఫోన్లు చూపిస్తూ తినిపిస్తున్నారని..ఈ ధోరణి మారాలని కోరారు.స్కూల్ నుండి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఫోన్లకు దూరంగా ఉండి, రోజుకు కనీసం ఒక గంట పిల్లలతో గడిపితే వారిలో సానుకూల మార్పు వస్తుందని చెప్పారు.ఈ వేడుకలో గాంధీ గ్లోబల్ మండల కన్వీనర్ వెన్ రెడ్డి సంధ్యా రాజు, ఏడవ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల చైర్మన్ కే.వీ.బీ. కృష్ణారావు, ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల, చింతల కరుణ, పబ్బు వంశీ, బడుగు శ్రీరాములు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News