Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:12 AM

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం
April 07, 2026 01:49 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ MSN ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక నియామక కార్యక్రమం నిర్వహించారు. ‘సంపాదిస్తూ చదువుకోండి’ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉచిత ఉన్నత విద్య అవకాశాన్ని కల్పిస్తున్నారు.

సంస్థ హెచ్‌ఆర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులను API విభాగంలో టెక్నికల్ ట్రైనీలుగా నియమించనున్నట్లు తెలిపారు.

ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వేతనంతో పాటు వార్షికంగా పనితీరు ఆధారంగా వేతన పెంపు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగంతో పాటు ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా ఉచితంగా B.Sc (కెమిస్ట్రీ) చదివే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

2024, 2025, 2026 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ (MPC/BiPC/MLT) పూర్తి చేసి కనీసం 50 శాతం మార్కులు సాధించిన 17 నుంచి 21 ఏళ్ల లోపు అబ్బాయిలు అర్హులని తెలిపారు. ఉద్యోగి రాష్ట్ర బీమా (ESI) ద్వారా వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయని చెప్పారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్, అధ్యాపకులు వి. నరసింహారావు, కిరణ్, అశోక్ రెడ్డి, మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News