చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం
చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం
Editor Desk
రామన్నపేట, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ MSN ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక నియామక కార్యక్రమం నిర్వహించారు. ‘సంపాదిస్తూ చదువుకోండి’ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉచిత ఉన్నత విద్య అవకాశాన్ని కల్పిస్తున్నారు.
సంస్థ హెచ్ఆర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులను API విభాగంలో టెక్నికల్ ట్రైనీలుగా నియమించనున్నట్లు తెలిపారు.
ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వేతనంతో పాటు వార్షికంగా పనితీరు ఆధారంగా వేతన పెంపు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగంతో పాటు ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా ఉచితంగా B.Sc (కెమిస్ట్రీ) చదివే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
2024, 2025, 2026 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ (MPC/BiPC/MLT) పూర్తి చేసి కనీసం 50 శాతం మార్కులు సాధించిన 17 నుంచి 21 ఏళ్ల లోపు అబ్బాయిలు అర్హులని తెలిపారు. ఉద్యోగి రాష్ట్ర బీమా (ESI) ద్వారా వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయని చెప్పారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్, అధ్యాపకులు వి. నరసింహారావు, కిరణ్, అశోక్ రెడ్డి, మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి