Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన ఎడిటర్ శ్రీ కొండా మల్లేశం గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 04:04 PM

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం
April 07, 2026 01:49 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ MSN ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక నియామక కార్యక్రమం నిర్వహించారు. ‘సంపాదిస్తూ చదువుకోండి’ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉచిత ఉన్నత విద్య అవకాశాన్ని కల్పిస్తున్నారు.

సంస్థ హెచ్‌ఆర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులను API విభాగంలో టెక్నికల్ ట్రైనీలుగా నియమించనున్నట్లు తెలిపారు.

ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వేతనంతో పాటు వార్షికంగా పనితీరు ఆధారంగా వేతన పెంపు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగంతో పాటు ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా ఉచితంగా B.Sc (కెమిస్ట్రీ) చదివే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

2024, 2025, 2026 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ (MPC/BiPC/MLT) పూర్తి చేసి కనీసం 50 శాతం మార్కులు సాధించిన 17 నుంచి 21 ఏళ్ల లోపు అబ్బాయిలు అర్హులని తెలిపారు. ఉద్యోగి రాష్ట్ర బీమా (ESI) ద్వారా వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయని చెప్పారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్, అధ్యాపకులు వి. నరసింహారావు, కిరణ్, అశోక్ రెడ్డి, మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News