PRINT TIME: July 02, 2026 07:18 PM
బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం
బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం
April 26, 2026 02:42 PM
58 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండల కన్వీనర్ గుత్తా బాలక్రిష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
బూదిలి హైస్కూల్లో సుమారు రూ.40 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్, రెండు తరగతి గదులు, బోర్వెల్ & సంపు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
అనంతరం “జలధార – నీటి నిర్వహణ” కార్యక్రమంలో భాగంగా బూదిలి తండా సమీపంలోని రెడ్డి కుంట వంక వద్ద జలధార పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హస్తకళల రాష్ట్ర డైరెక్టర్ సోమశేఖర్, టిడిపి జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పలువురు స్థానిక నాయకులు, మాజీ సర్పంచులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి