Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:18 PM

బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం

బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం

బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం
April 26, 2026 02:42 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండల కన్వీనర్ గుత్తా బాలక్రిష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.


బూదిలి హైస్కూల్‌లో సుమారు రూ.40 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్, రెండు తరగతి గదులు, బోర్‌వెల్ & సంపు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.


అనంతరం “జలధార – నీటి నిర్వహణ” కార్యక్రమంలో భాగంగా బూదిలి తండా సమీపంలోని రెడ్డి కుంట వంక వద్ద జలధార పనులను ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో హస్తకళల రాష్ట్ర డైరెక్టర్ సోమశేఖర్, టిడిపి జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పలువురు స్థానిక నాయకులు, మాజీ సర్పంచులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News