బోనగిరిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం
బోనగిరిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం
Editor Desk
: బోనగిరి పట్టణంలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
మార్చి 10 నుంచి సీపీఎం బృందం పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను సేకరించినట్లు తెలిపారు. హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఐదేళ్ల క్రితం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను ఇప్పటివరకు వినియోగంలోకి తేవలేదని, ప్రతి వార్డులో పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.
ఫుట్పాత్ వ్యాపారుల కోసం నిర్మించిన సముదాయాలు ఉపయోగంలోకి రావడం లేదని, ఇందిరమ్మ ఇళ్లకు మంజూరైన నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. పెన్షన్లు పెంపు, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలు అమలులో లేకపోవడంపై విమర్శించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతుండటం, సింగన్నగూడెంలో వాటర్ ఫిల్టర్ పనిచేయకపోవడం, ఎల్బీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తేవకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. 32వ వార్డులో స్టేడియం కబ్జాలకు గురవుతోందని, ప్రహరీ గోడ నిర్మించి రక్షించాలని కోరారు.
పట్టణంలో అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఆదాయానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంధముల మాతయ్య, బందల ఎల్లయ్య, వనం రాజు, వోల్దాస్ అంజయ్య, చింతల శివ, మన్నె రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి