బోగారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం.
బోగారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం.
Editor Desk
రామన్న పేట మండలంలోని భోగారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు గ్రామంలో పర్యటించి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకానీ ఉమా-మహేష్, గ్రామపంచాయతీ సభ్యులు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు-యాదగిరి, మేడి ఆంజనేయులు, కడారి పావని పాపయ్య, విద్యా కమిటీ చైర్మన్ పబ్బు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కే శేఖర్, పాఠశాల హెడ్మాస్టర్ ముస్కు వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, సదానందం, భార్గవి, శిరీష, అటెండర్ మంగమ్మ, మధ్యాహ్న భోజన సేవకురాలు శంకరమ్మతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి