బిల్లులు లేవు – బతుకులు కష్టాలు... రోడ్డెక్కిన పాడి రైతులు
బిల్లులు లేవు – బతుకులు కష్టాలు... రోడ్డెక్కిన పాడి రైతులు
Editor Desk
పాలకి డబ్బు లేదు... రైతుల కష్టాలకు ఎవరూ లేరు!
రామన్నపేట మండలం, నీర్నంల గ్రామంలో పాడి రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం నేపథ్యంలో పశువుల దాణా ఖర్చులు గణనీయంగా పెరిగినప్పటికీ, బిల్లులు అందక ఇబ్బందులు రెట్టింపయ్యాయని తెలిపారు.
మదర్ డైరీ యాజమాన్యం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. “రైతులు ఎలా ఉన్నా పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అంటూ మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులను ఇబ్బందులకు గురి చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ దొంతర బోయిన దాసు, శివలీల, డైరెక్టర్లు నోముల పద్మ, రామలింగం, ఆవుల సైదమ్మ, భగవంతం, రైతులు ఏబీసీ కిష్టయ్య, కన్నెబోయిన నరసింహ, కొత్త పరుశురాం, మనకుంట్ల లింగయ్య, రేవణాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి