Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మడిగలు సీజ్.. బకాయిల భారం ఎట్టకేలకు బైటపడింది! నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:22 AM

బిల్లులు లేవు – బతుకులు కష్టాలు... రోడ్డెక్కిన పాడి రైతులు

బిల్లులు లేవు – బతుకులు కష్టాలు... రోడ్డెక్కిన పాడి రైతులు

బిల్లులు లేవు – బతుకులు కష్టాలు... రోడ్డెక్కిన పాడి రైతులు
April 09, 2026 07:38 AM 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలకి డబ్బు లేదు... రైతుల కష్టాలకు ఎవరూ లేరు!

రామన్నపేట మండలం, నీర్నంల గ్రామంలో పాడి రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం నేపథ్యంలో పశువుల దాణా ఖర్చులు గణనీయంగా పెరిగినప్పటికీ, బిల్లులు అందక ఇబ్బందులు రెట్టింపయ్యాయని తెలిపారు.

మదర్ డైరీ యాజమాన్యం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. “రైతులు ఎలా ఉన్నా పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అంటూ మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ దొంతర బోయిన దాసు, శివలీల, డైరెక్టర్లు నోముల పద్మ, రామలింగం, ఆవుల సైదమ్మ, భగవంతం, రైతులు ఏబీసీ కిష్టయ్య, కన్నెబోయిన నరసింహ, కొత్త పరుశురాం, మనకుంట్ల లింగయ్య, రేవణాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News