Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించలేదు బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:50 PM

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
April 21, 2026 08:02 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం భువనగిరి మండల పరిధిలోని వడపర్తి,హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్,బస్వాపూర్, చందుపట్ల,వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ,పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా పినిలుస్తోందని తెలిపారు. పంజాబ్,హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో అధిక స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని పేర్కొంటూ,ఇది రాష్ట్ర రైతుల కృషికి నిదర్శనమని అన్నారు. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా,వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఐకేపీ ప్రాంగణంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్లు,ప్రజాప్రతినిధులు,అధికారులు,రైతులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News