భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
Sthanikam District Staff Reporter
భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం భువనగిరి మండల పరిధిలోని వడపర్తి,హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్,బస్వాపూర్, చందుపట్ల,వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ,పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా పినిలుస్తోందని తెలిపారు. పంజాబ్,హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో అధిక స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని పేర్కొంటూ,ఇది రాష్ట్ర రైతుల కృషికి నిదర్శనమని అన్నారు. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా,వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఐకేపీ ప్రాంగణంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్లు,ప్రజాప్రతినిధులు,అధికారులు,రైతులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి