Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:55 AM

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
April 21, 2026 08:02 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం భువనగిరి మండల పరిధిలోని వడపర్తి,హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్,బస్వాపూర్, చందుపట్ల,వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ,పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా పినిలుస్తోందని తెలిపారు. పంజాబ్,హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో అధిక స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని పేర్కొంటూ,ఇది రాష్ట్ర రైతుల కృషికి నిదర్శనమని అన్నారు. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా,వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఐకేపీ ప్రాంగణంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్లు,ప్రజాప్రతినిధులు,అధికారులు,రైతులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News