Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 PM

భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన

భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన

భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన
March 29, 2026 10:16 AM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల సమస్య తీవ్రంగా ఉందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆరోపించింది. ఈ మేరకు పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి కత్తుల కాన్షీరామ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన ఓటు హక్కును కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు నమోదు చేసుకోవడం, వేరే ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడ కూడా ఓటు కొనసాగించడం, అధికారులపై ఒత్తిడి తెచ్చి పేర్లు జాబితాలో ఉంచించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇలాంటి దొంగ ఓట్ల ఆధారంగా అధికారంలోకి రావాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని కాన్షీరామ్ పేర్కొన్నారు. పేదల ఓటును దోచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే రాజకీయాలకు భువనగిరి ప్రజలు మద్దతు ఇవ్వబోరని స్పష్టం చేశారు.

అందువల్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా పునఃసమీక్షించి, డబుల్ ఓట్లు, దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే భారీ స్థాయిలో ఫిర్యాదులు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

నిజాయితీ ఓటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని, దొంగ ఓట్లతో వచ్చిన అధికారాన్ని ప్రజలు తిరస్కరిస్తారని కాన్షీరామ్ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News