Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:05 AM

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష
April 08, 2026 06:46 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో భూభారతి, ప్రభుత్వ భూములు, సాధా బైనామాలు, SIR, మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోలు, ఆన్లైన్ ఇసుక సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి ద్వారా భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. భూ సమస్యలు, వివాదాలను తక్షణమే పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

సాధా బైనామాల సమస్యలను చట్టపరంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని తెలిపారు. SIR (Special Intensive Revision) కార్యక్రమంలో ఓటరు జాబితాలను ఖచ్చితంగా సవరించి, బూత్ స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.

మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలను వేగవంతం చేసి, దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు.

జిల్లాలో పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణా జరిగేలా “మన ఇసుక వాహనం” బుకింగ్ వ్యవస్థను అమలు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దీని ద్వారా అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చని తెలిపారు.

అదేవిధంగా, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమయానికి ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, మండల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News