భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష
భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష
Editor Desk
జిల్లాలో భూభారతి, ప్రభుత్వ భూములు, సాధా బైనామాలు, SIR, మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోలు, ఆన్లైన్ ఇసుక సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బుధవారం మినీ మీటింగ్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి ద్వారా భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. భూ సమస్యలు, వివాదాలను తక్షణమే పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
సాధా బైనామాల సమస్యలను చట్టపరంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని తెలిపారు. SIR (Special Intensive Revision) కార్యక్రమంలో ఓటరు జాబితాలను ఖచ్చితంగా సవరించి, బూత్ స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.
మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలను వేగవంతం చేసి, దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా చూడాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు.
జిల్లాలో పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణా జరిగేలా “మన ఇసుక వాహనం” బుకింగ్ వ్యవస్థను అమలు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దీని ద్వారా అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చని తెలిపారు.
అదేవిధంగా, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమయానికి ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, మండల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి