Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 09:06 PM

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష
April 08, 2026 06:46 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో భూభారతి, ప్రభుత్వ భూములు, సాధా బైనామాలు, SIR, మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోలు, ఆన్లైన్ ఇసుక సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి ద్వారా భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. భూ సమస్యలు, వివాదాలను తక్షణమే పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

సాధా బైనామాల సమస్యలను చట్టపరంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని తెలిపారు. SIR (Special Intensive Revision) కార్యక్రమంలో ఓటరు జాబితాలను ఖచ్చితంగా సవరించి, బూత్ స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.

మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలను వేగవంతం చేసి, దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు.

జిల్లాలో పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణా జరిగేలా “మన ఇసుక వాహనం” బుకింగ్ వ్యవస్థను అమలు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దీని ద్వారా అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చని తెలిపారు.

అదేవిధంగా, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమయానికి ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, మండల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News