వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం… కొంశెట్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రత్నమాల దంపతులు. రత్నమాల అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో తరచూ గొడవలు జరిగాయి.
ఇటీవల జరిగిన వాగ్వాదంలో రత్నమాలతో పాటు ఆ వ్యక్తి కూడా శ్రీనివాస్ను అవమానించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి