Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:50 PM

భారతదేశ పోరాటాల యోధుడు సి. ఆర్.గోదా శ్రీరాములు

భారతదేశ పోరాటాల యోధుడు సి. ఆర్.గోదా శ్రీరాములు

భారతదేశ పోరాటాల యోధుడు  సి. ఆర్.గోదా శ్రీరాములు
09-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి పురస్కరించుకొని గురువారం రోజున సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ పోరాటాల యోధుడు చండ్ర రాజేశ్వరరావు సి ఆర్ అని అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రజలకు స్వేచ్ఛ,స్వతంత్రం ఉండాలని సమానత్వం, న్యాయం కోసం అనునిత్యం ఆయన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం ,పేద ప్రజల కోసం తన జీవితాంతం పోరాటం చేసి, తన యావదాస్తిని పేద ప్రజలకు పంచిన మహోన్నతమైన నాయకుడు సి ఆర్ అని అన్నారు. సుదీర్ఘకాలం 1964 నుంచి 1990 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పని చేశారని. ఆయన పని చేస్తున్న సందర్భంలో అనేక భూ పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకు భూమిని పంపిణీ చేయించాడని, ముఖ్యంగా,శ్రామిక వర్గానికి రావాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలు తేవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుని ఆశయ సాధన కోసం మనమంతా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ సిపిఐ మండల కార్యదర్శి కల్లపల్లి మహేందర్, సిపిఐ మున్సిపల్ శాఖ కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య, పట్టణ సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారి, కార్యవర్గ సభ్యులు కోకల రవీందర్, గుండు వెంకటేష్ ,మాటూరీ మల్లయ్య నాయకులు ఆర్ విజయలక్ష్మి, కంబాల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భారతదేశ పోరాటాల యోధుడు సి. ఆర్.గోదా శ్రీరాములు

Article Image

యాదగిరిగుట్ట చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి పురస్కరించుకొని గురువారం రోజున సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ పోరాటాల యోధుడు చండ్ర రాజేశ్వరరావు సి ఆర్ అని అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రజలకు స్వేచ్ఛ,స్వతంత్రం ఉండాలని సమానత్వం, న్యాయం కోసం అనునిత్యం ఆయన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం ,పేద ప్రజల కోసం తన జీవితాంతం పోరాటం చేసి, తన యావదాస్తిని పేద ప్రజలకు పంచిన మహోన్నతమైన నాయకుడు సి ఆర్ అని అన్నారు. సుదీర్ఘకాలం 1964 నుంచి 1990 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పని చేశారని. ఆయన పని చేస్తున్న సందర్భంలో అనేక భూ పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకు భూమిని పంపిణీ చేయించాడని, ముఖ్యంగా,శ్రామిక వర్గానికి రావాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలు తేవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుని ఆశయ సాధన కోసం మనమంతా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ సిపిఐ మండల కార్యదర్శి కల్లపల్లి మహేందర్, సిపిఐ మున్సిపల్ శాఖ కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య, పట్టణ సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారి, కార్యవర్గ సభ్యులు కోకల రవీందర్, గుండు వెంకటేష్ ,మాటూరీ మల్లయ్య నాయకులు ఆర్ విజయలక్ష్మి, కంబాల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News