భారతదేశ పోరాటాల యోధుడు సి. ఆర్.గోదా శ్రీరాములు
భారతదేశ పోరాటాల యోధుడు సి. ఆర్.గోదా శ్రీరాములు
Editor Desk
యాదగిరిగుట్ట చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి పురస్కరించుకొని గురువారం రోజున సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ పోరాటాల యోధుడు చండ్ర రాజేశ్వరరావు సి ఆర్ అని అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రజలకు స్వేచ్ఛ,స్వతంత్రం ఉండాలని సమానత్వం, న్యాయం కోసం అనునిత్యం ఆయన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం ,పేద ప్రజల కోసం తన జీవితాంతం పోరాటం చేసి, తన యావదాస్తిని పేద ప్రజలకు పంచిన మహోన్నతమైన నాయకుడు సి ఆర్ అని అన్నారు. సుదీర్ఘకాలం 1964 నుంచి 1990 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పని చేశారని. ఆయన పని చేస్తున్న సందర్భంలో అనేక భూ పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకు భూమిని పంపిణీ చేయించాడని, ముఖ్యంగా,శ్రామిక వర్గానికి రావాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలు తేవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుని ఆశయ సాధన కోసం మనమంతా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ సిపిఐ మండల కార్యదర్శి కల్లపల్లి మహేందర్, సిపిఐ మున్సిపల్ శాఖ కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య, పట్టణ సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారి, కార్యవర్గ సభ్యులు కోకల రవీందర్, గుండు వెంకటేష్ ,మాటూరీ మల్లయ్య నాయకులు ఆర్ విజయలక్ష్మి, కంబాల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి