Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:38 PM

భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్

భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్

భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్
April 23, 2026 05:28 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

భగీరథ మహర్షి పట్టుదలకు ప్రతీకగా నిలిచారని, ఆయన త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు.

గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగానదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి భగీరథ మహర్షి అని కొనియాడారు. ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.

అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు మహర్షి చిత్రపటానికి అంజలి ఘటించి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి సాహితీ, ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, కుల సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News