Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్ ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 07:01 PM

భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్

భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్

భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్
April 23, 2026 05:28 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

భగీరథ మహర్షి పట్టుదలకు ప్రతీకగా నిలిచారని, ఆయన త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు.

గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగానదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి భగీరథ మహర్షి అని కొనియాడారు. ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.

అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు మహర్షి చిత్రపటానికి అంజలి ఘటించి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి సాహితీ, ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, కుల సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News