భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్
భగీరథ మహర్షి త్యాగం ఆదర్శం: అదనపు కలెక్టర్
Editor Desk
భువనగిరి,
భగీరథ మహర్షి పట్టుదలకు ప్రతీకగా నిలిచారని, ఆయన త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు.
గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగానదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి భగీరథ మహర్షి అని కొనియాడారు. ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.
అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు మహర్షి చిత్రపటానికి అంజలి ఘటించి నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి సాహితీ, ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, కుల సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి