భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని భగీరథ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.
భగీరథ మహర్షి విగ్రహానికి గజమాల వేసి, “జై భగీరథ, జై జై భగీరథ”, “ఉప్పరుల ఐక్యత వర్ధిల్లాలి” వంటి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
తరువాత కర్నూలులో రంగేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాల నుండి సుమారు 100 మంది 15 వాహనాల్లో తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో యు.జి. వెంకటేష్, సి.ఎన్. రాము, పూల వెంకటేష్, ఉప్పర బాబయ్య, శంకర, కబాబ్ అంజి, యర్రప్ప, శ్రీనివాసులు, మేకలపల్లి మహేష్, పరిగి ఆదినారాయణప్ప, బ్రాహ్మణపల్లి నిర్మల, సురేష్, మాగేచెరువు తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి