Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:03 PM

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ
April 11, 2026 08:50 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుగొండ పట్టణంలోని వాసవి కళ్యాణమండపంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతరావు పూలె జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు, సభ్యులు నివాళులు అర్పించారు.

సభలో ప్రసంగించిన నాయకులు పూలే గారు సామాజిక న్యాయం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. బీసీల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే బీసీలకు స్థానిక సంస్థల నుండి శాసనసభల వరకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన హక్కులు అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఎన్నో సంవత్సరాలు గడిచినా బీసీలకు న్యాయం పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో నియోజకవర్గం, జిల్లా స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాములు యాదవ్, కోనాపురం ఈశ్వరయ్య, డ్వాక్రా రామాంజనేయులు, కురబ అశ్వర్థ నారాయణ, జయచంద్ర, కురబ నంజుండ, బోయ నంజుండ, మంగళ రామాంజనేయులు, బుడబుక్కల నరసింహులు, ఈశ్వరయ్య, వెంకటేశులు, బోయ చెనరాయుడు, బోయ రాము తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News