బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ
బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ
EDIGA NAVEENKUMAR
పెనుగొండ పట్టణంలోని వాసవి కళ్యాణమండపంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతరావు పూలె జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు, సభ్యులు నివాళులు అర్పించారు.
సభలో ప్రసంగించిన నాయకులు పూలే గారు సామాజిక న్యాయం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. బీసీల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
అలాగే బీసీలకు స్థానిక సంస్థల నుండి శాసనసభల వరకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన హక్కులు అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఎన్నో సంవత్సరాలు గడిచినా బీసీలకు న్యాయం పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో నియోజకవర్గం, జిల్లా స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో శ్రీరాములు యాదవ్, కోనాపురం ఈశ్వరయ్య, డ్వాక్రా రామాంజనేయులు, కురబ అశ్వర్థ నారాయణ, జయచంద్ర, కురబ నంజుండ, బోయ నంజుండ, మంగళ రామాంజనేయులు, బుడబుక్కల నరసింహులు, ఈశ్వరయ్య, వెంకటేశులు, బోయ చెనరాయుడు, బోయ రాము తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి