Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:37 PM

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ

బీసీల అభ్యున్నతికి పూలే ఆశయాలే మార్గం: పెనుగొండలో జయంతి సభ
April 11, 2026 08:50 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుగొండ పట్టణంలోని వాసవి కళ్యాణమండపంలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతరావు పూలె జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నేతలు, సభ్యులు నివాళులు అర్పించారు.

సభలో ప్రసంగించిన నాయకులు పూలే గారు సామాజిక న్యాయం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. బీసీల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే బీసీలకు స్థానిక సంస్థల నుండి శాసనసభల వరకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన హక్కులు అమలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఎన్నో సంవత్సరాలు గడిచినా బీసీలకు న్యాయం పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో నియోజకవర్గం, జిల్లా స్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాములు యాదవ్, కోనాపురం ఈశ్వరయ్య, డ్వాక్రా రామాంజనేయులు, కురబ అశ్వర్థ నారాయణ, జయచంద్ర, కురబ నంజుండ, బోయ నంజుండ, మంగళ రామాంజనేయులు, బుడబుక్కల నరసింహులు, ఈశ్వరయ్య, వెంకటేశులు, బోయ చెనరాయుడు, బోయ రాము తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News