Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 22, 2026 07:31 PM

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్
April 22, 2026 05:50 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ అవలంబిస్తున్న విభజన రాజకీయాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు వ్యతిరేకించింది మహిళా బిల్లును కాదని, ఏకపక్షంగా తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన విధానాన్నేనని స్పష్టం చేశారు.

కమ్యూనిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో “మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్—వంచనలు, వాస్తవాలు” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా, దక్షిణాది రాష్ట్రాలను ద్వితీయ శ్రేణిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ రాజకీయ లాభాలు పొందాలని చూస్తోందన్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అన్యాయమని ప్రశ్నించారు. డీలిమిటేషన్ అమలు అయితే దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

33 శాతం మహిళా రిజర్వేషన్ యథాతథంగా అమలు చేయాలని, విభజన రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

సదస్సుకు ఏభూషి నర్సింహ అధ్యక్షత వహించగా, సిపిఎం నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, జంపాల అండాలు, కందుల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News