Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 10:52 AM

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్
April 22, 2026 05:50 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ అవలంబిస్తున్న విభజన రాజకీయాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు వ్యతిరేకించింది మహిళా బిల్లును కాదని, ఏకపక్షంగా తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన విధానాన్నేనని స్పష్టం చేశారు.

కమ్యూనిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో “మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్—వంచనలు, వాస్తవాలు” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా, దక్షిణాది రాష్ట్రాలను ద్వితీయ శ్రేణిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ రాజకీయ లాభాలు పొందాలని చూస్తోందన్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అన్యాయమని ప్రశ్నించారు. డీలిమిటేషన్ అమలు అయితే దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

33 శాతం మహిళా రిజర్వేషన్ యథాతథంగా అమలు చేయాలని, విభజన రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

సదస్సుకు ఏభూషి నర్సింహ అధ్యక్షత వహించగా, సిపిఎం నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, జంపాల అండాలు, కందుల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News