బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్
బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్
Editor Desk
బీజేపీ అవలంబిస్తున్న విభజన రాజకీయాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు వ్యతిరేకించింది మహిళా బిల్లును కాదని, ఏకపక్షంగా తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన విధానాన్నేనని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో “మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్—వంచనలు, వాస్తవాలు” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా, దక్షిణాది రాష్ట్రాలను ద్వితీయ శ్రేణిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ రాజకీయ లాభాలు పొందాలని చూస్తోందన్నారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అన్యాయమని ప్రశ్నించారు. డీలిమిటేషన్ అమలు అయితే దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్పై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
33 శాతం మహిళా రిజర్వేషన్ యథాతథంగా అమలు చేయాలని, విభజన రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
సదస్సుకు ఏభూషి నర్సింహ అధ్యక్షత వహించగా, సిపిఎం నాయకులు మేక అశోక్ రెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, జంపాల అండాలు, కందుల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి