Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దుండగుల దాడిలో గాయపడిన దుశ్చర్ల సత్యనారాయణ పరామర్శ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 02:02 PM

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
April 27, 2026 12:10 PM 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా సమానత్వం, అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలతో ప్రారంభమైన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ అంకితభావంతో పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉందని, మళ్లీ కెసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News