Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 08:47 PM

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
April 27, 2026 12:10 PM 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా సమానత్వం, అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలతో ప్రారంభమైన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ అంకితభావంతో పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉందని, మళ్లీ కెసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News