బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
Editor Desk
కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా సమానత్వం, అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలతో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ అంకితభావంతో పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ఉందని, మళ్లీ కెసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి