బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం
బయోఫ్లాక్ విధానంలో చేపల సాగుపై 3 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం
స్థానికం బృందం
పాలేరు: మత్స్య పరిశోధన స్థానం పాలేరు, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో “బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు” అంశంపై మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తున్నాయి.
ఈ శిక్షణా కార్యక్రమానికి ఖమ్మం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల (NAF), భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్ మరియు సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పాలేరు సర్పంచ్ బానోతు నాగేశ్వరావు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ మత్స్య రైతులు ఆక్వాకల్చర్ రంగంలో ముందుకు రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ పథకాలతో పాటు బ్యాంకుల ద్వారా లభించే వివిధ రకాల రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యంగ్ ప్రొఫెషనల్ కందూరి అరుణ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు పరిస్థితుల గురించి మత్స్య రైతులకు వివరించారు. మత్స్య శాస్త్రవేత్త బి. రవీందర్ బయోఫ్లాక్ విధానంలో పెంచదగిన చేపల రకాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా పాలేరు మత్స్య పరిశోధన స్థానంలోని చేప పిల్లల హేచరీ యూనిట్, బయోఫ్లాక్ ట్యాంకులు, సమీకృత కోళ్లు–చేపల పెంపకం, సమీకృత గొర్రెలు–చేపల పెంపకం, సమీకృత చేపలు–వరి సాగు మరియు వివిధ రకాల అలంకరణ చేపల పెంపకం విధానాలను క్షేత్రస్థాయిలో వివరించారు.
మత్స్య శాస్త్రవేత్త పి. శాంతన్న బయోఫ్లాక్ విధానంలో చేపల సాగు చేపట్టేటప్పుడు స్థల ఎంపిక, ఫ్లాక్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేత యొక్క పోషక విలువలు మరియు మేత యాజమాన్యంపై మత్స్య రైతులకు వివరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి