బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ
బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ
Sthanikam District Staff Reporter
ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే,బీర్ల ఐలయ్యకు వినతి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో తెలంగాణ ప్రజానాట్యమండలి స్థానిక కళాకారులకు ప్రదర్శనలలో అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు.ఈ మేరకు సిపిఐ ప్రతినిధి బృందం ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్యకు వినతి పత్రం సమర్పించింది.ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు.అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వేదికపై అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.యాదగిరిగుట్ట కొండపై ఉన్న స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.కళాకారుల కోసం గుర్తింపు కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వడం,కోలాట మరియు జానపద కళాబృందాలకు సబ్సిడీ రుణాలు కల్పించడం,ప్రతి కళాకారునికి నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి