Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:34 PM

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ
21-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే,బీర్ల ఐలయ్యకు వినతి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో తెలంగాణ ప్రజానాట్యమండలి స్థానిక కళాకారులకు ప్రదర్శనలలో అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు.ఈ మేరకు సిపిఐ ప్రతినిధి బృందం ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్యకు వినతి పత్రం సమర్పించింది.ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు.అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వేదికపై అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.యాదగిరిగుట్ట కొండపై ఉన్న స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.కళాకారుల కోసం గుర్తింపు కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వడం,కోలాట మరియు జానపద కళాబృందాలకు సబ్సిడీ రుణాలు కల్పించడం,ప్రతి కళాకారునికి నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలి: సిపిఐ

Article Image

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే,బీర్ల ఐలయ్యకు వినతి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో తెలంగాణ ప్రజానాట్యమండలి స్థానిక కళాకారులకు ప్రదర్శనలలో అవకాశం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి కోరారు.ఈ మేరకు సిపిఐ ప్రతినిధి బృందం ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్యకు వినతి పత్రం సమర్పించింది.ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు.అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వేదికపై అవకాశాలు కల్పిస్తే సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.యాదగిరిగుట్ట కొండపై ఉన్న స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.కళాకారుల కోసం గుర్తింపు కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వడం,కోలాట మరియు జానపద కళాబృందాలకు సబ్సిడీ రుణాలు కల్పించడం,ప్రతి కళాకారునికి నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News