బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్
బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్
Editor Desk
ఖమ్మం, : ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్కు ఈ నెల 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది మోజెస్ క్రిస్టోఫర్ సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అధికారులు పి.ఏ.జే. శేఖర్ రాజు, థౌఫిక్లకు ఆయన నామినేషన్ అందజేశారు.
ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్కు చెందిన సుమారు 900 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నామినేషన్ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. మద్ది శ్రీనివాస్ రెడ్డి హాజరై అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కొలిపాక రమేష్, ఉబ్బన రామకృష్ణ, పల్లా రాజశేఖర్, పర్స లక్ష్మీనరసింహారావు, ఆవుల అనురాధ, బాజీ జాలావతి, చుంచు కోటేశ్వరరావు, ఎం. కన్నంబా, మద్దెల వెంకటేశ్వర్లు, తెల్లూరి వెంకట్, కొల్లి నాగేశ్వరరావు, సింగం జనార్దన్, కొనకంచి చరణ్, నవీన్ బాబీ, బండారు వెంకట రమణ, పొట్లపల్లి విప్లవకుమార్, సంధ్య, కంచర్ల విజయ్ కుమార్, అద్దంకి ప్రవీణ్, మధు, దయాకర్, షేక్ సల్మా తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి