Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 PM

బ్లాక్ టీచింగ్ లేక బీఈడీ కాలేజీల దందా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు: డీఎస్ఎఫ్

బ్లాక్ టీచింగ్ లేక బీఈడీ కాలేజీల దందా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు: డీఎస్ఎఫ్

బ్లాక్ టీచింగ్ లేక బీఈడీ కాలేజీల దందా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు: డీఎస్ఎఫ్
February 25, 2026 05:13 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా బీఈడీ కాలేజీలను నడుపుతున్న యాజమాన్యాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వి. వెంకట బసవరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ… సౌకర్యాలు లేని, నిబంధనలు పాటించని కాలేజీలకు గుర్తింపు కొనసాగించడం సమంజసం కాదన్నారు. బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా విద్యార్థులను పరీక్షలకు పంపించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని బీఈడీ కాలేజీలు విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయని ఆరోపించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే యాజమాన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున కాలేజీల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ విషయంపై వైస్ చాన్స్‌లర్ వి. వెంకట బసవరావు స్పందిస్తూ… బ్లాక్ టీచింగ్ నిర్వహించని కాలేజీలపై విచారణ జరిపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News