బ్లాక్ టీచింగ్ లేక బీఈడీ కాలేజీల దందా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు: డీఎస్ఎఫ్
బ్లాక్ టీచింగ్ లేక బీఈడీ కాలేజీల దందా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు: డీఎస్ఎఫ్
స్థానికం బృందం
కర్నూలు: బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా బీఈడీ కాలేజీలను నడుపుతున్న యాజమాన్యాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ వి. వెంకట బసవరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ… సౌకర్యాలు లేని, నిబంధనలు పాటించని కాలేజీలకు గుర్తింపు కొనసాగించడం సమంజసం కాదన్నారు. బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా విద్యార్థులను పరీక్షలకు పంపించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని బీఈడీ కాలేజీలు విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయని ఆరోపించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే యాజమాన్యాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున కాలేజీల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ విషయంపై వైస్ చాన్స్లర్ వి. వెంకట బసవరావు స్పందిస్తూ… బ్లాక్ టీచింగ్ నిర్వహించని కాలేజీలపై విచారణ జరిపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి