Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్ వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 10:40 PM

బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ విజయవంతం

బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ విజయవంతం

బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ విజయవంతం
April 14, 2026 06:53 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం జై భీమ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

పెనుకొండ వై జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బహుజనులు భారీగా పాల్గొన్నారు. చేతుల్లో బహుజన జెండాలు పట్టుకొని “జై భీమ్, జై భీమ్” నినాదాలతో ర్యాలీ సాగింది.

అనంతరం పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో అంబేద్కర్ జయంతి సభను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శివరామకృష్ణ, హిందూపురం పార్లమెంట్ సభ్యుడు పార్థసారథి, రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ రాజ్, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ అధికారి బి.ఎన్. సుబ్బన్న, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరి గంగాధర్ పాల్గొన్నారు.

అదేవిధంగా బహుజన చైతన్య వేదిక ఉపాధ్యక్షులు రంగేపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి పెనుకొండ రవికుమార్, రాయలసీమ ఉపాధ్యక్షుడు చల్లపల్లి ఈశ్వర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగార్జున, రాష్ట్ర గౌరవ సలహాదారులు రొద్దం బాబు, యంగ్ ఇండియా వెంకటేశులు, కర్ణాటక రూరల్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి బాబు, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రామాంజినప్ప, రంగేపల్లి కదిరప్ప, రామదాసు, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News