Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో అవినీతి అధికారి – ఏసీబీ వలలో ఏడీ సైదులు ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 09:42 PM

బెదిరింపులకు భయపడేది లేదు.. టీవీఏఈ జేఏసీ

బెదిరింపులకు భయపడేది లేదు.. టీవీఏఈ జేఏసీ

బెదిరింపులకు భయపడేది లేదు.. టీవీఏఈ జేఏసీ
April 16, 2026 07:32 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదు ..

9వ రోజుకు చేరిన టీవీఏఈ జేఏసీ సమ్మె కొనసాగుతున్న అర్థనగ్న ప్రదర్శనలు..


నల్లగొండ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీవీఏఈ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం మరియు యాజమాన్యం, వారిని విధుల్లోంచి తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని కార్మిక నేతలు తీవ్రంగా ఖండించారు. యాజమాన్యం అనుసరిస్తున్న ఇటువంటి మొండి వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు తలొగ్గకుండా భారీ సంఖ్యలో తరలివచ్చి తొమ్మిదో రోజు దీక్షను విజయవంతం చేశారు.

ఈ క్రమంలో బుధవారం యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్మికుడు గోడ కొమ్మలు గుండెపోటుతో మరణించడం సమ్మె శిబిరంలో విషాదాన్ని నింపింది. మృతి చెందిన కార్మికుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సమ్మెలో పాల్గొన్న వారంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తమ నిరసనను ఉధృతం చేస్తూ 12 మంది కార్మికులు అర్థనగ్న ప్రదర్శన చేపట్టి ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. కార్మికుల పోరాటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నేడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్మికులకు రావలసిన న్యాయమైన డిమాండ్ల సాధనలో తమ పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిట్టబోయిన లింగస్వామి, నాయకులు లింగారెడ్డి, పెరుమాళ్ల మురళి, విశ్వం, వేణుగోపాల్ రెడ్డి, బొప్పాని యాదయ్య, గణేష్, అద్దంకి వెంకన్న, పోతపాక విజయ్ కుమార్, కోటి, విజయ్ రెడ్డి, పరమేష్, ఉపేందర్, రమేష్, వెంకన్న, లచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, పెరిక శేఖర్, రఫియా, ప్రసన్నకుమార్, అరుణ, లక్ష్మి, శైలజ, రాజేష్, మైల సైదులు, నాగమణి, కరుణ, కళావతి, ఆరీఫా, భారతి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News