Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:55 PM

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్  మిర్యాల రాజ్‌కుమార్
April 05, 2026 04:45 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా రామన్న పేట మండలం లోని వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం, గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్ దంపతులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీనికి స్పందించిన వారు తమ పిల్లలను వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా గ్రామంలో సాయంత్రం వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఏఏపీసీ చైర్‌పర్సన్ పులగం సులోచన, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, మాజీ ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ కర్రే రాజు, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News