బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్కుమార్
బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్కుమార్
Editor Desk
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా రామన్న పేట మండలం లోని వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం, గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్కుమార్ దంపతులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీనికి స్పందించిన వారు తమ పిల్లలను వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా గ్రామంలో సాయంత్రం వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఏఏపీసీ చైర్పర్సన్ పులగం సులోచన, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్కుమార్, మాజీ ఎస్ఎంసీ చైర్పర్సన్ కర్రే రాజు, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి