Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:45 PM

బడిబాటలో సర్పంచ్ చొరవ.. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్లు

బడిబాటలో సర్పంచ్ చొరవ.. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్లు

బడిబాటలో సర్పంచ్ చొరవ.. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్లు
April 09, 2026 08:31 PM 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బోగారం గ్రామంలో సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం నిర్వహించారు.

“మన ఊరు–మన బడి” నినాదంతో గడపగడపకు వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరిచి, పలు మంది విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా కలిసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులతో పాటు అవసరమైతే వాలంటీర్లను కూడా నియమించి సహకరించాలని సూచించారు. చదువుకు సంబంధించిన ప్రతి విషయంలో తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ముసుకు వెంకటరెడ్డి, గ్రామ యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News