బడిబాటలో సర్పంచ్ చొరవ.. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్లు
బడిబాటలో సర్పంచ్ చొరవ.. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్లు
Editor Desk
రామన్నపేట: ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బోగారం గ్రామంలో సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం నిర్వహించారు.
“మన ఊరు–మన బడి” నినాదంతో గడపగడపకు వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరిచి, పలు మంది విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా కలిసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులతో పాటు అవసరమైతే వాలంటీర్లను కూడా నియమించి సహకరించాలని సూచించారు. చదువుకు సంబంధించిన ప్రతి విషయంలో తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ముసుకు వెంకటరెడ్డి, గ్రామ యువత పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి