PRINT TIME: July 01, 2026 08:26 PM
బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం
బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం
April 16, 2026 07:15 PM
263 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,
మండలంలోని నీర్నంల గ్రామానికి చెందిన గంగుల శశికళ అనారోగ్యంతో మృతి చెందగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి