రామన్నపేట,
మండలంలోని నీర్నంల గ్రామానికి చెందిన గంగుల శశికళ అనారోగ్యంతో మృతి చెందగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి