బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నివాళులు
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నివాళులు
Editor Desk
సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
పార్టీ ఇంచార్జి మల్లప్ప ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎం. పులి రాజు, పి.ఎస్. జయరాం మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలు అణగారిన వర్గాల అభ్యున్నతికి చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
సమాన హక్కులు, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం మనందరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
విక్రమ్, మంచాలి రాజు, ఎల్లప్ప, జాలి మంచి వీరేష్, నాగరాజు, వెంకీ నాయక్, ఏవి వెంకటేష్, గౌస్, వలి భాష తదితరులు హాజరయ్యారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి