Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 PM

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నివాళులు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నివాళులు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నివాళులు
05-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

పార్టీ ఇంచార్జి మల్లప్ప ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎం. పులి రాజు, పి.ఎస్. జయరాం మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలు అణగారిన వర్గాల అభ్యున్నతికి చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

సమాన హక్కులు, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం మనందరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

విక్రమ్, మంచాలి రాజు, ఎల్లప్ప, జాలి మంచి వీరేష్, నాగరాజు, వెంకీ నాయక్, ఏవి వెంకటేష్, గౌస్, వలి భాష తదితరులు హాజరయ్యారు

Sthanikam

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నివాళులు

Article Image

సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

పార్టీ ఇంచార్జి మల్లప్ప ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎం. పులి రాజు, పి.ఎస్. జయరాం మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలు అణగారిన వర్గాల అభ్యున్నతికి చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

సమాన హక్కులు, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం మనందరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

విక్రమ్, మంచాలి రాజు, ఎల్లప్ప, జాలి మంచి వీరేష్, నాగరాజు, వెంకీ నాయక్, ఏవి వెంకటేష్, గౌస్, వలి భాష తదితరులు హాజరయ్యారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News